ముహూర్తం ఖరారు
రవాణా సౌకర్యం మెరుగు..
కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం
–8లో u
●
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం. – అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్,
కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా
మంత్రి వాకిటి కృషితోనే..
ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించేందుకు మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొంతమంది అడ్డంకులు సృష్టించినా.. సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు నిధులు మంజూరు చేయించారు. డిసెంబర్ 1న రేవంత్రెడ్డి రాకతో మా కల సాకారం కాబోతుంది.
– రహ్మతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్, వనపర్తి జిల్లా
పూర్వవైభవం తీసుకువస్తా..
ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించగా.. సానుకూలంగా స్పందించారు. ఆత్మకూర్కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి,
రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి
ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్ వద్ద, హెలిప్యాడ్కు సంబంధించి ఆత్మకూర్ జాతర మైదానం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు.
సీఎం పర్యటనలో భాగంగా స్థల పరిశీలన జరుపుతున్న మంత్రి వాకిటి శ్రీహరి,
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు
గద్వాల– ఆత్మకూర్ మధ్య తగ్గనున్న 22 కిలోమీటర్ల దూరం
ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి
రెవెన్యూ డివిజన్ దిశగా ఆత్మకూర్ అడుగులు
డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి
పర్యటన
ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
ముహూర్తం ఖరారు
ముహూర్తం ఖరారు
ముహూర్తం ఖరారు
ముహూర్తం ఖరారు


