వేసవి శిక్షణ.. సత్ఫలితం | - | Sakshi
Sakshi News home page

వేసవి శిక్షణ.. సత్ఫలితం

Jun 11 2025 12:04 PM | Updated on Jun 11 2025 12:04 PM

వేసవి శిక్షణ.. సత్ఫలితం

వేసవి శిక్షణ.. సత్ఫలితం

శిక్షణ కేంద్రాలు ఇవే..

మదనాపురం, గోపాల్‌పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్‌గల్‌, కొత్తకోట, ఆత్మకూర్‌, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రచారం చేయడానికి వీలు లేకపోవడంతో ఆయా మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిబిరాలు నిర్వహించారు.

క్రీడా సామగ్రి పంపిణీ..

క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందించిందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ కిట్లు, అథ్లెటిక్స్‌ పరికరాలను ఆయా కోచ్‌లకు జిల్లాకేంద్రంలో అందించడంతో క్రీడాకారులు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. రోజు ఉద యం ఎనిమిది గంటల వరకు, సాయంత్ర ఐ దు నుంచి ఆరు గంటల వరకు శిక్షణనిచ్చారు.

అమరచింత: బడిఈడు పిల్లలు వేసవి సెలవుల్లో చెడుదారులు పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కలిగిస్తూ నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ తర్ఫీదునిచ్చే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని వివిధ మండలాల్లో 10 చోట్ల క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసి మే ఒకటో తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శిక్షణనిచ్చింది. శిబిరాలకు హాజరైన విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో శిక్షణ పొంది వాటిలో ప్రతిభ చాటే స్థాయికి ఎదిగారు. కోచ్‌లు క్రీడా నైపుణ్యాలను నేర్పిస్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారిలోని ప్రతిభను వెలికితీయడంలో సఫలీకృతులయ్యారు. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీతో పాటు వివిధ క్రీడా విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి వారికి శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. శిక్షకులకు శిక్షణ కాలంలో గౌరవ వేతనంగా రూ.4 వేలు అందించారు. 16 ఏళ్లలోపు విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి నెల పాటు శిక్షణనిచ్చినట్లు కోచ్‌లు వెల్లడించారు.

జిల్లాలో ముగిసిన క్రీడా శిబిరాలు

వివిధ ఆటల్లో శిక్షణ పొందిన విద్యార్థులు

పాఠశాల స్థాయిలో విద్యతో పాటు ఆటలపై దృష్టి

హాకీ, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో తర్ఫీదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement