రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్‌ : మంత్రి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్‌ : మంత్రి

Jun 11 2025 12:04 PM | Updated on Jun 11 2025 12:04 PM

రాజ్య

రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్‌ : మంత్రి

చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని గూడెం, అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని.. బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్లే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడి ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ లక్ష్యమని.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారని వివరించారు. భారత్‌ జోడోయాత్రతో దేశ ప్రజలకు రాహుల్‌పై మక్కువ పెరిగిందని.. పార్లమెంట్‌ వేదికగా బీజేపీ నాయకులు అవమానిస్తున్నారన్నారు. అదేవిధంగా జూరాల చివరి ఆయకట్టు కోసం ఏర్పాటు చేస్తున్న లింక్‌ కెనాల్‌ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, కొత్త కళ్యాణ్‌రావు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, బీచుపల్లి యాదవ్‌, చిదంబర్‌రెడ్డి, రంజిత్‌కుమర్‌, తేజారెడ్డి, జ్యోతిగౌడ్‌, మందడి కృష్ణ, గూడెం సుధాకర్‌ పాల్గొన్నారు.

రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా లేదని.. రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

ఖిల్లాఘనపురం: రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తికేంద్రాలు, బూత్‌కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా బుచ్చిబాబుగౌడ్‌, ఉపాధ్యక్షులుగా రాజు, శాంతమ్మ, భద్రయ్య, శంకర్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శులుగా దశరథం, గోపాల్‌రెడ్డి, కార్యదర్శులుగా కేశన్న, లక్ష్మి, తులసీకుమార్‌, సంధ్య, కోశాధికారిగా మల్లేష్‌ ఎన్నికయ్యారు. జిల్లా, మండల నాయకులు రాంరెడ్డి, గోపి ముదిరాజ్‌, రామచంద్రి, అక్బర్‌, రాజు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్ల

జిల్లా కార్యవర్గం ఎన్నిక

వనపర్తి రూరల్‌: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్ల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా 4వ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జి.శారద, ప్రధానకార్యదర్శిగా బి.కవిత, కోశాధికారిగా జి.రాధ, ఉపాధ్యక్షులుగా బి.నారా యణమ్మ, జి.జ్యోతి, వెంకటేశ్వరమ్మ, విజయ, రమాదేవి, సహాయ కార్యదర్శులుగా నాగేంద్ర మ్మ, సుమతి, అరుణ, రామచంద్రమ్మ, రాజే శ్వరి, భాగ్యలక్ష్మి, ప్రశాంతి, రాధతో పాటు 25 మంది సభ్యులుగా ఎనుకున్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్‌ : మంత్రి1
1/1

రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్‌ : మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement