ఎస్.కోట, జామిలో భూ ప్రకంపనలు
ఎస్.కోట/జామి: ఎస్.కోట నియోజకవర్గంలోని ఎస్.కోట, జామి మండలాల్లో మంగళవారం తెల్లవారు జామున 4.30– 5గంటల ప్రాంతంలో భూమి స్పల్పంగా కంపించింది. ఈ ఘటనలో కొందరు ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకెన్లపాటు భూమి కంపించిందని జామి, కుమరాం, గొడికొమ్ము, ఎస్.కోటలోని గాంధీనగర్, శ్రీనివాసకాలనీ, బర్మాకాలనీ వాసులు తెలిపారు.
స్వల్పంగా భూమి కంపించింది
వేకువజామున ఉదయం 4.30 ప్రాంతలో భూమి స్వల్పంగా కంపించింది. ఆ సమయంలో నేను, నా భార్య లేచిఉన్నాం. ఒక్క సారిగా షేక్ అయినట్లు అయింది. తరువాత చాలమంది ఇదే విషయాన్ని చెప్పారు.
– కొత్తలి అప్పలనాయుడు, అధ్యాపకుడు, జామి


