చందులూరు విద్యార్థుల ప్రతిభ
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో వై.చరణ్కుమార్, ఎ.కార్తీక్, సీహెచ్ ఎర్నమ్మ ఉన్నట్టు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం సగుబండి శివరామకృష్ణ, ఉపాధ్యాయుడు చిన్నంనాయుడు, శాప్ కార్యదర్శి ఉమామహేశ్వరరావు అభినందించారు.


