‘వినరా ఓ వేమ’ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలి | - | Sakshi
Sakshi News home page

‘వినరా ఓ వేమ’ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలి

Sep 17 2025 7:17 AM | Updated on Sep 17 2025 8:07 AM

విజయనగరం: ఉత్తరాంధ్ర సంస్కృతిని, మాండలికాన్ని ప్రస్ఫుటపరిచే విధంగా రూపొందించిన ‘వినరా ఓ వేమ’ చిత్రం ప్రేక్షకాదరణ పొంది మంచి విజయం సాధించాలని విజయనగరం కార్పొరేషన్‌ కమిషనర్‌ పల్లి నల్లనయ్య ఆకాంక్షించారు. పల్సర్‌ బైక్‌ రమణ తొలిసారిగా కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం పోస్టర్‌ను కమిషనర్‌ పల్లి నల్లనయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసతో రూపొందిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. అదే రీతిన ఉత్తరాంధ్ర యాసతో, పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చిత్ర కధానాయకుడు, పల్సర్‌ బైక్‌ రమణ, దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్‌ మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వినరా ఓ వేమ చిత్రాన్ని రూపొందించామన్నారు. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు ఆదరించి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. చిత్ర కథానాయికగా వైష్ణవి, నిర్మతగా సురేష్‌ వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో చిత్రం యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement