రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Jul 15 2025 6:13 AM | Updated on Jul 15 2025 6:13 AM

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

సాలూరు: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె పట్టణంలో మాట్లాడుతూ, కృష్ణా జిల్లా చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని ఆమె ఖండించారు. జిల్లాకు ప్రథమ పౌరురాలైన ఓ మహిళ పరిస్థితి ఇలా ఉందంటే ,రాష్ట్రంలో మిగిలిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షపూరితంగా ఈ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడుతూ ఏడాదిపాలనను పూర్తిచేసిందని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు.

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement