
రూ.6.19 కోట్లు..!
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం
విజయనగరం అర్బన్: గణాంక శాఖ పితామహులు ప్రొఫెసర్ పీసీమహల్నోబిస్ జన్నదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరుపుకొనే జాతీయ గణాంక దినోత్సవం కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికా రి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి సీపీవో పి.బాలాజీ, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీవో మాట్లాడుతూ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పథకానికి పీసీమహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. గ్రామంలో భూమికి హద్దులు నిర్ధారించి అందులో సాగైన భూమి, సాగుకి పనికి రాని భూమి, దేవాలయాలు, చెరువులు, శ్మశానాలు, పల్లం భూమి, మెట్టు భూమి, సత్రాలు, పన్నులు వసూలు, వస్తువుల అమ్మకాలు, చారిటీ ద్వారా ఆదాయం వంటి విషయాలను సేకరణ ప్రక్రియ ప్రాధాన్యతను పాలకులకు తెలియజేశారని తెలి పారు. ఏడీ, ఉప గణాంకాధికారులు పాల్గొన్నారు.
బీమా భారం