
సీ్త్రనిధి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లు
సీతానగరం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధికి వివిధరకాల వృత్తులపై శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించనున్నట్లు వెలుగు సీ్త్రనిధి జిల్లా ఏజీఎం పి.కామరాజు అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో వెలుగు ఏపీఎం రెడ్డిశ్రీరాములు అధ్యక్షతన సిబ్బందితో సీ్త్ర నిధి రుణసదుపాయాలపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం కామరాజు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లుండగా ఇప్పటి వరకూ రూ.9 కోట్ల 20లక్షలు పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు. మండలసమాఖ్య పర్యవేక్షణలో అర్హులైన వారందరికీ జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సీ్త్ర నిధి రుణాలు బ్యాంకుల ద్వారా సమకూర్చనున్నామన్నారు. అలాగే సీతానగరం మండలం టార్గెట్ రూ.8 కోట్లు ఉండగా ఇప్పటివరకూ రూ.90 లక్షలు రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. వృత్తి పనిలో శిక్షణ పొందిన వారంతా అర్థికంగా లబ్ధిపొందడానికి వివిధ రకాల వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.