
వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: రెవెన్యూ వినతులకు న్యాయమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జేసీ సేతుమాధవన్తో కలిసి రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, నీటి తీరువా, ఆన్లైన్ సేవలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అందరికీ గృహాలు పథకం కింద జిల్లాలో 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని వెరిఫైచేసి వెంటనే ఆన్లైన్ చేయాలని తెలిపారు. సచివాలయ సర్వేయర్లు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, వారికి వెంటనే మెమోలు జారీ చేసి జీతాలను నిలుపుదల చేయాలని ల్యాండ్ రికార్ుడ్స ఏడీ రమణమూర్తిని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్రావు, ఆశయ్య, డిప్యూటీ కలెక్టర్ మురళీ, హౌసింగ్ పీడీమురళీ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డీటీలు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్