
ఈఈను నేను.. కాదు నేను..!
–8లో
దోమల కాయిల్స్తో అనర్థాలు
దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతోమార్కెట్లో లభించే నాసిరకం మస్కిటో కాయిల్స్ను వినియోగించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ఈఈల మధ్య గురువారం కుర్చీలాట కొనసాగింది. కార్యాలయంలో వేర్వేరు కుర్చీల్లో ఇద్దరు కూర్చోవడంతో ఎవరు తమ ఈఈ అన్న ప్రశ్న కిందిస్థాయి ఉద్యోగుల్లో తలెత్తింది. కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి రిపోర్టు చేయాలో తెలియక సందిగ్దంలో పడ్డారు. వివరాలు పరిశీలిస్తే.. ఏడు నెలల కిందట సీతంపేట ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో రమాదేవిని నియమించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ నెల 9న ఆమె స్థానంలో కె.వి.ఎస్.ఎన్ కుమార్ను ఇక్కడ నియమించి రమాదేవిని నెల్లూరుకు బదిలీ చేశారు. ఈ నెల 11న కుమార్ సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తనను బదిలీ చేశారంటూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బదిలీ జీఓను హైకోర్టు ఆరువారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలతో తను ఇక్కడే ఈఈగా కొనసాగుతున్నట్టు రమాదేవి స్పష్టం చేశారు. ప్రభుత్వ బదిలీ జీఓ ప్రాప్తికి తనుకూడా ఇక్కడే ఈఈగా విధులు నిర్వహిస్తున్నట్టు కుమార్ తెలిపారు. బదిలీల్లో అక్రమాల వల్లే ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయంటూ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.
ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట
ప్రభుత్వం నియమించిందని ఒకరు, కోర్టు జీఓ సస్పెండ్ చేసిందని మరొకరు..
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ పోస్టుపై నెలకొన్న ఉత్కంఠ

ఈఈను నేను.. కాదు నేను..!