
విత్తనాలకుకటకట..!
విత్తనాలు తక్కువగా వచ్చాయి..
జీలుగు విత్తనాలు ఈ ఏడాది తక్కువగా వచ్చాయి.1295 క్వింటాళ్లుకు 740 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మాత్రమే వచ్చాయి. వాటిని రైతు సేవ కేంద్రాల్ ద్వారా రైతులకు అందించాం.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
●
విజయనగరం ఫోర్ట్:
ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గతేడాది ఖరీఫ్, రబీ కాలాలు ముగిసినా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. ఈ ఏడాది ఖరీఫ్ వచ్చినా ఇంకా ప్రకటనలే తప్ప సాయం అందని పరిస్థితి. వరి విత్తనాల సరఫరాను పక్కన పెడితే కనీసం వరి సాగుకు ముందు భూసారం పెంపునకు కీలకమైన పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంపై రైతన్న భగ్గుమంటున్నాడు. గతంలో అన్నదాతకు అండగా ఉండే రైతుభరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) సేవలు ఇప్పుడు నిర్వీర్యంగా కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, యంత్ర సాయం అందడం లేదు. రైతు సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న కూటమి నేతలు కనీసం విత్తనాలను కూడా అందించలేకపోవడం సిగ్గుచేటు. రైతు సుఖీభవను కాస్త దుఃఖీభవగా మార్చేశారంటూ రైతన్నలు వాపోతున్నారు.
జీలుగ విత్తనాలకు కటకట
పచ్చిరొట్ట ఎరువుల్లో ప్రధానమైన జీలుగ విత్తనాలు దొరకని పరిస్థితి. పిల్లిపెసర విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. జీలుగ విత్తనాలు జిల్లాకు 1295 క్వింటాళ్లు అవసరం కాగా 740.30 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. అవికూడ అయిపోయాయి. ప్రస్తుతం జీలుగ విత్తనాలు ఎక్కడా దొరకడం లేదు. అలాగే, పిల్లిపెసర విత్తనాలు సైతం 87 క్వింటాళ్లకు 22 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. వాటికి కూడా కొరత ఏర్పడింది.
మినప విత్తనాలు 95 క్వింటాళ్లు, పెసర 40 క్వింటాళ్లకు ఒక్క క్వింటా విత్తనాలు కూడా రాలేదు. వేరుశనగ 432 క్వింటాళ్లకు గాను 125 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. చోడి 80 క్వింటాళ్లకు ఒక క్వింటా కూడా రాలేదు. కంది 8.50 క్వింటాళ్లు, నువ్వులు 80 క్వింటాల విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా ఒక్క కిలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
అపరాల
విత్తనాలదీ
అదే పరిస్థితి..