క్లస్టర్‌ ఖాళీలు చూపించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ ఖాళీలు చూపించాల్సిందే..

Jun 13 2025 4:40 AM | Updated on Jun 13 2025 4:40 AM

క్లస్

క్లస్టర్‌ ఖాళీలు చూపించాల్సిందే..

కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద

ఉపాధ్యాయుల ఆందోళన

బైఠాయించి ప్లకార్డులతో నిరసన

కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై మండిపాటు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాల విద్యాబోధనలో నైపుణ్యాభివృద్ధికి కీలకంగా నిలిచే స్కూల్‌ కాంప్లెక్స్‌ల విధానాన్ని రద్దు చేసింది. వాటి స్థానంలో క్లస్టర్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. క్లస్టర్‌ మార్గదర్శకాల ప్రకారం ఇంతవరకు ఉన్న స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలలు వాటి దూరం. ఆయా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఆధారంగా జిల్లాలోని 162 స్కూల్‌ కాంప్లెక్స్‌ల స్థానంలో అదే సంఖ్యలో క్లస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌కు ప్రధానోపాధ్యాయుడితో పాటు స్కూళ్ల సంఖ్యను అనుసరించి ఒకటీ లేక రెండు ఎస్‌జీటీ పోస్టులను కేటాయించాలని క్లస్టర్‌ విధానంలో నిర్దేశించారు. అయితే ఈ పోస్టుల ఖాళీలను ప్రస్తుతం మాన్యువల్‌ కౌన్సెలింగ్‌లో తొలిరోజు నుంచి చూపించడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్‌ పరిధిలోని పోస్టులు కొత్తగా రూపొందించినవి మాత్రమేనని, మంజూరైన పోస్టులు కాదన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడైనా పోస్టులు ఖాళీ అయితే క్లస్టర్‌ పరిధిలో నియమించిన ఉపాధ్యాయులు ఆ స్థానాల్లోకి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీటిని జూనియర్లకు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పూర్తయిన తరువాత మిగిలిపోయిన జూనియర్‌ ఉపాధ్యాయులకు ఈ పోస్టులను కౌన్సెలింగ్‌లో కేటాయిస్తామన్నారు. అయితే, క్లస్టర్‌ పరిధిలో పోస్టుల ఖాళీలను సైతం చూపించి, కౌన్సెలింగ్‌లోనే భర్తీచేయాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌పై ఇంతవరకు స్పష్టత రాలేదు.

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకపోవడం ఉపాధ్యాయులను ఆందోళన, ఆవేదనకు గురిచేస్తోంది. ఎస్జీటీ పోస్టుల బదిలీలను మాన్యువల్‌ విధానంలో జరపాలన్న ఉపాధ్యాయుల ఆందోళనకు కూటమి ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌లో పోస్టుల ఖాళీలన్నింటినీ చూపించకపోవడంతో పారదర్శకత లోపించిందంటూ ఉపాధ్యాయులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించాలని, తమ చేతుల్లో ఏమీ లేదంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో గురువారం నిరసనకు దిగారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలోనే బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు సీరియల్‌ నంబర్‌ 500 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌ సాయంత్రం 4 గంటల సమయంలో 370 నంబర్‌ వచ్చింది. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మరోసారి క్లస్టర్‌ ఖాళీలు చూపించాలంటూ డిమాండ్‌ను లేవనెత్తారు. తొలుత అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నిరసనకు పిలుపునిచ్చారు. కౌన్సెలింగ్‌ ప్రాంగణం

కౌన్సెలింగ్‌ హాల్‌ బయట ఉపాధ్యాయుల ఆందోళన

బయట, లోపల ఉన్న ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా నిరసనకు దిగి నినాదాలు చేశారు. ఈ సమయంలో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లోని ఖాళీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా, రాత్రి 9 గంటల తర్వాత విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలోని ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ జరిపారు.

అంతా అస్తవ్యస్తం..

క్లస్టర్‌ ఖాళీలు చూపించాల్సిందే.. 1
1/1

క్లస్టర్‌ ఖాళీలు చూపించాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement