
● సారథి గెడ్డ ఇలా.. సాగునీరు వెళ్లేదెలా..
రాజాం ప్రాంతంలోని సారథి గెడ్డ పూర్తిగా పూడుకుపోయింది. తుప్పలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. కనీసం సాగునీరు వెళ్లే దారి కనిపించడం లేదు. ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి. మరోవైపు రంగప్ప చెరువు మదుములకు షట్టర్లు లేకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. చి‘వరి’లో వరి పంటకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తక్షణమే స్పందించి సారథిగెడ్డలో ఆక్రమణలతో పాటు, రంగప్ప చెరువు మదుములకు షట్టర్లు బించాలని కోరుతూ నీటిపారుదల శాఖ ఏఈ రాజేష్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. – రాజాం సిటీ