పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద | - | Sakshi
Sakshi News home page

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద

Jun 14 2025 6:36 AM | Updated on Jun 14 2025 6:36 AM

పశుసం

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద

విజయనగరం ఫోర్ట్‌: పశు సంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)గా డాక్టర్‌ ఆర్‌.శారద శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీపురపల్లి ఏరియా వెటర్నరీ ఆస్పత్రిలో ఏడీగా పనిచేసి బదిలీపై విజయనగరం జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు.

గిరిజన వర్సిటీ పనులు వేగవంతం చేయండి

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్‌

విజయనగరం అర్బన్‌: కేంద్రీయ గిరిజన యూ రివర్సిటీ పనులను వేగవంతం చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. వర్సిటీ పనులను శుక్రవారం పరిశీలించారు. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణిని కలిసి నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ 2019లో స్థాపితమైన విశ్వవిద్యాలయ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. పనుల్లో ప్రభుత్వం అశ్రద్ధ చూపడం తగదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గిరిజన వర్సిటీది కీలకపాత్రగా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు కె.విజయగౌరి, నాయకులు వెంకటరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలి

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు

విజయనగరం అర్బన్‌: గిరిజన ప్రాంతాలలో రేషన్‌ సరఫరాను పాత ఎండీయూ విధానంలో కొనసాగించాలని, లేదంటే ప్రత్యేక రేషన్‌ డిపోలను ఏర్పాటుచేసి సరుకులు సరఫరా చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు ప్రభుత్వాన్ని కోరారు. రేషన్‌ తీసుకోవడంలో గిరిజనుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ శుక్రవారం మాట్లాడారు. ప్రస్తుతం రేషన్‌ తీసుకోవడంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సివిల్‌ సప్లయి కమిషనర్‌కు ఎస్టీ కమిషన్‌ లేఖ రాసిందన్నారు. ఏజెన్సీ ప్రజలు ఆహార భద్రతకు దూరంగా ఉన్న పరిస్థితులున్నాయని, ఈ నేపథ్యంలో ఎండీయూ విధానాన్ని ఆపడంవల్ల ప్రభుత్వం అందించే సరుకులు తీసుకునేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారన్నారు. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఎండీయూ విధానాన్ని కొనసాగించాలని డాక్టర్‌ శంకరరావు కోరారు.

సోమవారం సాలూరులో పీజీఆర్‌ఎస్‌

పార్వతీపురం టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమ వారం సాలూరులో నిర్వహిస్తామని కలెక్ట ర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. జిల్లా అధి కారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. సా లూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధికారులందరూ సాలూరులో నిర్వహించనున్న పీజీఆర్‌ఎస్‌లో పాల్గొనాలని కోరారు.

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద 1
1/3

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద 2
2/3

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద 3
3/3

పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement