సబ్‌జైల్‌ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌జైల్‌ ఆకస్మిక తనిఖీ

Jun 12 2025 2:59 AM | Updated on Jun 12 2025 3:53 AM

విజయనగరం లీగల్‌: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేర ప్రవృత్తిని విడనాడాలని సూచించారు. జైలులో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదన్నారు. అనంతరం సబ్‌ జైల్‌లో కొనసాగుతున్న జైల్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను తనిఖీ చేశారు. పారా లీగల్‌ వలంటీర్ల విధులపై ఆరా తీశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని, భోజనశాలను పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ను సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌ , సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement