ఆల్‌ ది బెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ది బెస్ట్‌

Jun 12 2025 2:59 AM | Updated on Jun 12 2025 2:59 AM

ఆల్‌ ది బెస్ట్‌

ఆల్‌ ది బెస్ట్‌

బొబ్బిలి: వ్యోమగామి శుభాంశు శుక్లా ఎటువంటి అవరోధాలు లేకుండా తన రోదసీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పట్టణ వాసులు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. బుధవారం రాత్రి కారుణ్య ఫౌండేషన్‌ సీఈఓ జేసీ రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా నాలుగు దశాబ్దాల అనంతరం వినువీధిలో దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసేందుకు రోదసీ యానం చేస్తున్న భారత వాయుసేన అధికారి శుభాంశు శుక్లా దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. స్థానిక ఐటీఐ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, రమణారావు, శివకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement