
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194
16 నుంచి కబడ్డీ టీమ్కు శిక్షణ
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా అండర్ 18న కబడ్డీ టీమ్కు శిక్షణ ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కబడ్డీ ఆసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అండర్ 18 కబడ్డీ టీమ్ జాతీయస్థాయిలో పాల్గొనడానికి క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండ్ 18 కబడ్డీ పోటీల్లో పాల్గొనదలచిన వారికి శిక్షణ అందిస్తామని, వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ 9440529144 నంబర్ను సంప్రందించాలని సూచించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, కోశాధికారి శనగల సీతారాం, సభ్యులు కాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
వేపాడ: మండలంలోని భర్తవానిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణంలోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితుడు పోతల రామునాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారు జామున తన షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ప్రింటర్తో పాటు నోట్బుక్స్, ఇతక సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ మీటర్ కాలిపోయిందని, ఫ్రిడ్జ్ పాక్షికంగా కాలిపోయిందని, సుమారు ఏభై వేలు రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
ఆమె చూపు పదిలం
చీపురుపల్లి: మరణానంతరం చూపు పదిలంగా ఉండాలంటే నేత్రదానం చేయాలి. అప్పుడే ఆ నేత్రాలు నిరంతరం సజీవంగా ఉంటాయి. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణానికి చెందిన అంధవరపు జగదాంబ చూపు కూడా నిరంతరం పదిలంగా ఉండనుంది. దీనికి ఆమె నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేయడమే కారణం. పట్టణంలోని ఆంజనేయపురంలో నివాసం ఉంటున్న ఆంధవరపు జగదాంబ(57) బుధవారం ఉదయం మృతిచెందారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అక్కడికి వెళ్లి నేత్రదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి భర్త అంధవరపు నర్సింగరావు తన భార్య నేత్రాలు దానం చేసేందుకు అంగీకరించగా విజయనగరం రెడ్క్రాస్ సొసైటీ టెక్నీషియన్ రమణ, సుధాకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి నుంచి కార్నియా సేకరించారు.
సీతం అధ్యాపకుడికి గుర్తింపు
● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ
విజయనగరం అర్బన్: ఐఐటీ మద్రాస్ నిర్వహించిన నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీస్ ఎన్హేన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపిందుకు విజయనగరం పట్టణంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మొగలి మధుబాబుకు ‘ఎన్పీఈఎల్ స్టార్ బిలీవర్’గా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన నాలుగు విభిన్న సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఐఐటీ మద్రాస్లో జరగనున్న ప్రత్యేక ‘స్టార్ బిలీవర్స్’ వర్క్షాప్కు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుబాబును కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డార్టర్ దామోదరనాయుడు, ఇతర అధ్యాపకులు అభినందించారు.

చికెన్

చికెన్

చికెన్