
సినిమా థియేటర్ల పరిశీలన
●వసతులపై జేసీ ఆరా
విజయనగరం అర్బన్: నగరంలోని పలు సినిమా థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ స్థాయి అధికారులు బుధ వారం తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లు, సీటింగ్ సదుపాయాలపై ఆరా తీశారు. లీలామహల్ థియోటర్లో బాల్కనీ సీటింగ్, తినుబండారాల అమ్మకం, అగ్నిప్రమాద నిరోధక చర్యలను జేసీ పరిశీలించారు. ఆర్డీఓ సవరమ్మ స్థానిక ఎన్సీసీ థియేటర్లో తనిఖీలు జరిపారు. యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. తనిఖీల్లో ఇన్చార్జి తహసీల్దార్ స్వర్ణకుమార్, ఆర్ఐ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ప్రధానోపాధ్యా యుల నుంచి ఎస్జీటీల వరకు వివిధ కేడర్ ఉపాధ్యాయులు 4,720 మంది బదిలీ అవకా శం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో స్థానచలనం తప్పనిసరి, మిగులు ఉపాధ్యాయులు 3,500 మంది వరకు ఉండడం గమనా ర్హం. మరోవైపు హెచ్ఎం ఉద్యోగోన్నతుల ప్రక్రి య పూర్తయింది. తుది జాబితాను బుధవారం రాత్రి డీఈఓ యు.మాణిక్యంనాయుడు విడుద ల చేశారు.
నదుల్లో జలకళ
వంగర/సంతకవిటి: అల్పపీడన ప్రభావంతో కురుస్నున్న వర్షాలకు నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటివరకు ఇసుక తెన్నెలతో దర్శనమిచ్చిన నదుల్లో నీటి సవ్వడి కనిపిస్తోంది. నారాయణపురం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరగడంతో కుడి ప్రధాన కాలువకు సాగునీరు విడిచిపెట్టారు.
డోలీలో నదిని దాటించి..
కొమరాడ: మండలంలోని చోళ్లపదం పంచాయతీ పరిధిలోని వనధార గ్రామనికి చెందిన కొండగొర్రి శ్రీను గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జర్వం ఎక్కవ కావడంతో కుటుంబ సభ్యులు కారుచీకటిలోనే డోలీలో నాగవళి నదిని దాటించి కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని, వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరారు.

సినిమా థియేటర్ల పరిశీలన