ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి

Jun 5 2025 7:54 AM | Updated on Jun 5 2025 7:54 AM

ఇద్దర

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి

పార్వతీపురం: పదమూడేళ్లుగా ఒకే కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలు కూడా వర్తించకుండా ఫెవిక్విక్‌లా అంటుకుని ఉన్న ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలని గిరిజన సంక్షేమ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎస్‌కోట, బొబ్బిలి కేంద్రాల్లో గల గిరిజన కళాశాల వసతి గృహాల్లో ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఒకే చోట 13 ఏళ్లుగా హెచ్‌డబ్యూఓలుగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆ ఇద్దరినీ డిప్యుటేషన్‌ పేరుతో అక్కడే కొనసాగిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తాజా బదిలీల్లో కూడా మరో ఐదేళ్లు అక్కడే ఉండేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇదే అమలైతే ఒకేచోట 18 ఏళ్లు పనిచేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. జిల్లా అధికారులకు కూడా వర్తించని నియమాలు, నిబంధనలు వీరిద్దరికే ఎలా వర్తిస్తున్నాయో అధికారులకే ఎరుక అని ఈ ఇద్దరు హెచ్‌డబ్యూఓలను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయకపోతే గిరిజన సంక్షేమ సంఘం తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సెల్‌ఫోన్ల దొంగకు మూడు నెలల జైలు

విజయనగరం క్రైమ్‌: సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న వ్యక్తిని విజయనగరం గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసకు చెందిన బి.అజయ్‌ కుమార్‌ గతంలో పలు రైర్వే ప్లాట్‌ఫాంలలో సెల్‌ఫోన్‌లు బ్యాగులు దొంగతనాలు చేసేవాడని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఈ మేరకు విజయనగరం స్టేషన్‌లో సెల్‌ఫోన్‌ చోరీ చేస్తుండగా పట్టుకుని కేసు నమోదుచేసి కోర్టులో ప్రవేశపెట్టగా అజయ్‌ చేసిన నేరం రుజువు కావడంతో విశాఖపట్నం రైల్వేకోర్టు మెజిస్ట్రేట్‌ అనురాగ్‌ మూడు నెలల జైలుశిక్ష విధించారని ఎస్సై బాలాజీరావు వివరించారు.

మహిళ మృతదేహం లభ్యం

విజయనగరం క్రైమ్‌: స్థానిక బాలాజీ జంక్షన్‌ సమీపంలోని పెద్ద చెరువు సమీపంలోని ఆచండ గార్డెన్‌ వద్ద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. పెద్ద చెరువు ఆచంట గార్డెన్‌ వద్ద మృతదేహం కనిపించిన వెంటనే వెంటనే స్థానికులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని మహిళకు 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నా రు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆమె నా భార్య..

విజయనగరం పెద్దచెరువు ప్రాంతంలోని ఆచంట గార్డెన్‌ వద్ద పోలీసులకు లభించిన మహిళ మృతదేహాన్ని గుర్తించి ఆమె తన భార్యేనంటూ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మృతురాలి భర్త చంద్రన్‌ స్పష్టం చేశాడు. ఈ మేరకు నగరంలోని గంటస్తంభం వద్ద ఉన్న వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తన భార్య ఆధార్‌ కార్డు తీసుకువెళ్లి లిఖిత పూర్వకంగా చంద్రన్‌ సమాచారం ఇచ్చాడు. భర్త చంద్రన్న ఇచ్చిన సమాచారంతో అనుమానాస్పద మృతి కాదని మతిస్థిమితం లేక ఆమె ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని సీఐ శ్రీనివాస్‌ చెప్పారు.

పిడుగుపాటుతో మహిళ మృతి

బలిజిపేట: మండలంలోని పలగర గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమ్మ(57) బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతిచెందింది. పెసర మొక్కలు తీసేందుకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో భర్త చిన్నంనాయుడితో పాటు ఆమె పొలానికి వెళ్లింది. కొంత సమయం అయిన తరువాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో భార్యాభర్తలు తిరిగి ఇంటికి వస్తుండగా బోలుబంద వద్ద పిడుగుపడడంతో ఆమె అక్కడికి అక్కడే మృతిచెందింది. మృతురాలిని చూసిన భర్త లబోదిబో మన్నారు. దీనిపై వీఆర్‌ఓ మౌనిక రిపోర్టు రాసి అందించారు.

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి1
1/2

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి2
2/2

ఇద్దరు హెచ్‌డబ్యూఓలను బదిలీ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement