
పెట్టుబడులు పోయాయి...
180 ఎకరాల విస్తీర్ణంలోని మామిడితోటలను సాగులో కి తీసుకున్నాను. రైతులకు చెల్లించిన సొమ్ముతో పాటు దుక్కులు, మందులు, ఎరువులకు సుమారు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.17 లక్షలకు మాత్రమే పంటను విక్రయించాను. ఇప్పుడు అకాల వర్షాలు కారణంగా కొనుగోలుకు పెద్ద వ్యాపారులు రావడంలేదు. మిగిలిన పంట తోటల్లోనే వదిలేసే పరిస్థితి ఉంది. ఈ ఏడా రూ.33 లక్షల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది. ధర పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయి. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
– బవిరెడ్డి చంద్ర,
మామిడి వ్యాపారి, రామభద్రపురం