
49 మంది ఎస్ఏలకు ఉద్యోగోన్నతి
విజయనగరం అర్బన్: జిల్లాలో కొద్దిరోజులుగా ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. హెచ్ఎంల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల ఉద్యోగోన్నతుల తంతు ముగిసింది. బదిలీల షెడ్యూల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ 2,125 మంది ఉండగా, వీరిలో తప్పనిసరి బదిలీల ద్వారా 1,290 మందికి స్థాన చలనం కలిగింది. మిగిలిన 835 మంది రిక్వెస్ట్ బదిలీలో ఉన్నారు. ఉద్యోగోన్నతి కోటాలో ఖాళీగా ఉన్న 49 పీఎస్హెచ్ఎం పోస్టులను అర్హులైన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేశారు. వీటిటో స్థానిక విద్యాసంస్థల స్కూళ్లు 24, మున్సిపాలిటీ స్కూల్స్ 20, కార్పొరేషన్ స్కూల్స్ 4, ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉంది.
ముస్లింలకు
బక్రీద్ శుభాకాంక్షలు
విజయనగరం: జిల్లాలోని ముస్లింలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, ఆనందం నింపాలని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. మనం చేసే త్యాగాలు సత్ఫలితాలు ఇస్తాయని, దీనికి అల్లా దయ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక బక్రీద్
● ముస్లిం సోదరులకు ఎస్పీ శుభాకాంక్షలు
విజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పిలుపునిచ్చారు. ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మసీదుల వద్ద బక్రీద్ పండగను భక్తిశ్రద్ధలతో, స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ పర్వదినాన ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియా లన్నారు. ముస్లిం హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

49 మంది ఎస్ఏలకు ఉద్యోగోన్నతి

49 మంది ఎస్ఏలకు ఉద్యోగోన్నతి