
యోగా.. ఆరోగ్య ఔషధం
పూసపాటిరేగ: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంచేసుకోవాలని పిలుపునిచ్చారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి బీచ్లో శుక్రవారం యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా నుంచి 8 లక్షల మందిని భాగస్వాములు చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర నిర్వహణలో భాగంగా ఇటీవల రామనారాయణం, నేడు చింతపల్లిలో యోగా సాధన చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన ఎస్.కోటలో 5 వేల మంది ఉపాధిహామీ వేతనదారులతో యోగాప్రదర్సన ఏర్పాటు చేస్తామని చెప్పారు. యోగాంధ్రంలో భాగంగా చింతపల్లి బీచ్లో సైకత శిల్పి హరికృష్ణ వేసిన యోగాంధ్ర సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, పర్యాటకశాఖ అధికారి కుమారస్వామి, ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు, ఎంపీడీఓ ఎం.రాధిక, తహసీల్దార్ తాడ్డి గోవింద, వైద్యాధికారులు రాజేష్వర్మ, ఎ.వి.సుధారెడ్డి, సర్పంచ్ బర్రి మొసలి, వివిధ శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యోగా.. ఆరోగ్య ఔషధం

యోగా.. ఆరోగ్య ఔషధం