
తీవ్రంగా నష్టపోతున్నాం...
మామిడి పండ్లు మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవేళ ఎవరో వచ్చినా వారికి నచ్చిన ధరకు అడుగుతున్నారు. పండ్లు పోతాయేమోనన్న భయంతో వారడిగిన ధరకు ఇవ్వాల్సి వస్తుంది. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోయకుండా చెట్లకే వదిలేస్తున్నాం. ఈ ఏడాది అప్పు చేసి రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి తోటలు కొనుగోలు చేశాను. అకాల వర్షాల వల్ల రూ.2 లక్షల వరకు నష్టపోతున్నాను. అప్పు తీరే పరిస్థితి లేదు. మామిడి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి.
– చొక్కాపు చిన్నంనాయుడు,
మామిడి రైతు, రామభద్రపురం