ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌

Jun 8 2025 12:34 AM | Updated on Jun 8 2025 12:34 AM

ప్రభు

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌

విజయనగరం ఫోర్ట్‌: ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసుకోవడానికి ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అదే విధంగా ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గాజులరేగ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీహరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు రిజిస్ట్రేషన్‌తో పాటు రెన్యూవల్‌ కోసం వైద్యులు విజయవాడ వచ్చేవారని, దీంతో ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆదివారం కూడా ఈ పక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.పద్మలీల, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో కోవిడ్‌ కేసు నమోదు

నెల్లిమర్ల మండలం పారసాం వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. నెల్లిమర్ల మండలం పారసాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గు, ఆయాసంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 రోజుల క్రితం చేరారు. అతనికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నిమోనియా అనుకుని ఆసుపత్రిలోని స్టెఫ్‌ డౌన్‌ ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. శుక్రవారం అతనికి కోవిడ్‌ పరీక్ష కోసం శాంపిల్‌ తీసి విశాఖలోని కేజీహెచ్‌కు పంపించారు. అక్కడ ఆర్‌టీపీఎస్‌ఆర్‌ పరీక్ష చేయగా అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పడు అతనికి ఆక్సిజన్‌ లెవల్స్‌ 45 నుంచి 60 ఉండేది. ప్రస్తుతం ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 నుంచి 91 మధ్య ఉంది. దీంతో అతన్ని ఆసుపత్రి వైద్యాధికారులు శనివారం డిశ్చార్జ్‌ చేసి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

ఇంకా అందుబాటులోకి రాని

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇంకా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు అందుబాటులోకి రాలేదు. ఆర్‌టీపీఎస్‌ఆర్‌ పరీక్షలు చేయడానికి అవసరమైన ల్యాబ్‌ను ఇంకా సిద్ధం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్‌ తీసి విశాఖపట్నం కేజీహెచ్‌కు పంపిస్తున్నారు.

9న విజన్‌ ప్లాన్‌

కార్యాలయం ప్రారంభం

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

విజయనగరం అర్బన్‌: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన విజన్‌ ప్లాన్‌ (దార్శనిక పత్రం) అమలు కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాలయాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వెల్లడించారు. నియోజకవర్గ కేంద్ర ఎంపీడీవో కార్యాలయంలో విజన్‌ ప్లాన్‌ అమలు కార్యాలయాలు ఏర్పాటవుతాయని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ కార్యాలయాలు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యాలయాల ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు చేపట్టాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదేశించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌ 1
1/2

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌ 2
2/2

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement