దక్కని ఆశించిన ‘మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

దక్కని ఆశించిన ‘మద్దతు’

Jun 4 2025 1:25 AM | Updated on Jun 4 2025 1:25 AM

దక్కన

దక్కని ఆశించిన ‘మద్దతు’

● అరకొరగా వరి క్వింటాకు రూ.69 పెంపు ● తీవ్ర ఆందోళనలో అన్నదాతలు

పార్వతీపురం/విజయనగరం ఫోర్ట్‌: విత్తనాలు, ఎరువులు సాగు వ్యయం రోజురోజుకూ తడిసి మోపెడవుతోంది. ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూలీల ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడంతో డీజిల్‌ ధరలు కూడా తగ్గనంటున్నాయి. ఈ ధరాభారంతో రైతుల సాగు వ్యయం ఏటా పెరిగిపోతోంది. ఖర్చులు, ధరలు పెరిగే స్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర సాగు వ్యయానికి అనుగుణంగా ఉంటుందని ఆశించినప్పటికీ రైతులకు నిరాశనే కలిగించింది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది. గిట్టుబాటు ధర ఎలా ఉన్న మద్దతు ధర సాగు వ్యయం ఆధారంగా పెరుగుతుందని ఆశపడిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. మొక్కుబడిగా వరి పంటకు మద్దతు ధరను కేంద్రం పెంచిందని రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా పాలకులు మోసగిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు, వ్యయానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ధాన్యం క్వింటాకు మద్దతుఽ ధర రూ.69 పెంచి రైతులను ప్రభుత్వం దగా చేసిందని వాపోతున్నారు. ఎంతోకాలంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. క్వింటా ధాన్యం మద్దతు ధర రూ.2,300ల నుంచి రూ.2369కి పెంచి రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

పంట పండించాలంటే నష్టపోవాల్సిందే..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధానమైన వరిపంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఏటా మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క రైతులకు మద్దతు ధర అందివ్వని పరిస్థితి నెలకొంది. రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లర్లకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవానికి దళారుల నుంచి రైతుల పేరు మీద మిల్లర్లకు తరలించే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షగా మిగిలింది. ఉమ్మడి జిల్లాలోని పలుగ్రామాల్లో ఎకరాకు 24 నుంచి 28 బస్తాల వరకు దిగుబడి వస్తోందని పంట దిగుబడి ప్రయోగాలద్వారా నిర్ధారించి అధికారులు ప్రకటించారు. దిగుబడుల ఆధారంగా మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ.2369 ప్రకారం 80 కిలోల బస్తాకు రూ.1790లు వస్తుంది. ఈ ప్రకారం 25 బస్తాలకు రూ.40వేల వరకు ఆదాయం రాగా, ఎకరాకు పెట్టుబడిగా రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు వ్యయం అవుతోంది. ఈ లెక్కన రైతుకు మిగిలేది రూ.10వేల నుంచి రూ.15వేలు మాత్రమే. అదే రైతు కూలికి వెళ్తే ఏడాదికి రూ. ఒక లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సొంతభూమి సాగు చేసుకునే రైతుకు కొంతవరకు మిగులు కనిపించే ఆవకాశం ఉండగా కౌలు రైతుకు కౌలు, ఖర్చులు పోను మిగిలేది అంతంతమాత్రమేగానే ఉంది.

మద్దతు ధరపై పునరాలోచన చేయాలి

ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర సాగు ఖర్చులకు వచ్చిన ఆదాయానికి పొంతన ఉండడం లేదు. రోజురోజుకూ వ్యవసాయ మదుపులు పెరిగిపోతున్నాయి. కూలీలు కూడా దొరకడం లేదు. వ్యవసాయం చేయాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు కేవలం మొక్కుబడిగా మద్దతు ధర పెంచి మమ అనిపించి రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర పెంచడంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలి.

–బి.అప్పలనాయుడు, రైతు, నాగూరు

దక్కని ఆశించిన ‘మద్దతు’1
1/1

దక్కని ఆశించిన ‘మద్దతు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement