
● నిరాశ చెందొద్దు..
నేను పదో తరతగతి ఫలితాల్లో 262 మార్కులతో ఆర్డినరీగా పాసయ్యాను. ఏ మాత్రం బాధపడకుండా పట్టుదలతో చదివి ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేసి, ఆ తర్వాత బీఈడీ చదివాను. డీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా అంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని లేదా తక్కువ మార్కులు వచ్చాయని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి. నిరాశ చెందకుండా పట్టుదలతో చదువుతూ ముందుకెళ్లాలి.
– చింతల తిరుపతిరావు, ఉపాధ్యాయుడు