
నేలబావిలో పడి యువకుడి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం గ్రామ సమీపంలో వెంకటరాయుడుపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ నేలబావిలో పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 10మంది స్నేహితులు ఈతకు వెళ్లారు. వారిలో పార్వతీపురం పట్టణంలోని తూర్పు వీధికి చెందిన మజ్జి తరుణ్ (23) ప్రమాదవశాత్తు నేలబావిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఆమె చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.