
‘వెన్నుపోటు దినం’
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే
విజయనగరం:
ఎన్నికలకు ముందు అధికార దాహంతో హామీ లు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ అమలు చేయాలంటూ ప్రశ్నించేందుకే ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్టు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోలగట్ల పిలుపునిచ్చారు. ఆదివారం తన నివాసంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 4న నిర్వహించే వెన్నుపో టు దినం కరపత్రాలను, వాల్పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోల గట్ల మాట్లాడుతూ చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలేనని దుయ్యబట్టారు. నాడు దివంగత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిస్తే... నేడు 5 కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఈ నెల 4న ఉదయం 9 గంటలకు నగ రంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి నిరసన ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నారు.
ప్రజల పక్షాన నిలబడదాం
ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను నెరవేర్చాల్సిన ఆవశ్యకత రాజకీయ పార్టీలపై ఉందని కోలగట్ల అన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు పేరిట మేలైన పాలనందించినప్పటికీ, కూటమి నాయకుడు చంద్రబాబు అంతకన్నా మెరుగైన పాలన అందిస్తార న్న ఆశతో ఓట్లేసి గెలిపించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కేవలం స్పౌజ్ పింఛన్లు మంజూరు మినహా మిగిలి న హమీలను నెరవేర్చకపోవటంతో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించటం జరుగుతుందని వివరించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు రూ.10వేలు చొప్పున ఇస్తామని చెప్పి మోసగించారని, గత ఐదేళ్లు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందిస్తే నేడు మళ్లీ డీలర్ల వ్యవస్థను తీసుకువచ్చి వినియోగదారులను రేషన్ దుకా ణాలు చుట్టూ తిప్పే ప్రక్రియను పునఃప్రారంభించా రన్నారు.
నాయకులు, కార్యకర్తలే ముందుండి నడిపించాలి
అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీని పార్టీ నాయకులు, కార్యకర్తలే ముందుండి నడిపించాలని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఏడాది పాటు పాలన సాగించిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైంద ని, ఈ తరుణంలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమా లను విజయవంతంగా నిర్వహించాలని సూచించా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా బాధ్యతగా పని చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో పని చేసిన విధంగా 2029 ఎన్నికల్లో కష్టించి పని చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ టెంకల అచ్చెంనాయుడు, ఎస్వివి.రాజేష్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. రాను న్న రోజుల్లో సమన్వయంతో పని చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు.
ఏడాదైనా.. హామీల అమల్లో విఫలం
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
4న జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ
పార్టీ శ్రేణులు తరలిరావాలి
మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి