
పేదల బియ్యం పక్కదారి
ఈ చిత్రం చూశారా... ఇదేంటి రేషన్ డిపోల్లో ఉండాల్సిన బియ్యం కోళ్లఫారం షెడ్ లో ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా. మంత్రి ఇలాకా.. మజాకా అన్నట్టుగా... పేదలకు సరఫరా చేసే బియ్యం నేరుగా అవే గోనెల్లో బొండపల్లి మండలం కిండాం అగ్రహారంలోని కోళ్లఫారంలో దర్శనమిచ్చాయి. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం ఇదిగో ఇలా కోళ్లఫారానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ బియ్యం బస్తాల నెట్టును చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యం.. ఇంత పెద్దమొత్తంలో నేరుగా ఎలా తరలిస్తున్నారని ముక్కునవేలేసుకున్నారు. 6ఏ కేసు నమోదుచేసి ఆరా తీస్తున్నారు.
చిత్రంలో బియ్యం బస్తాలను చూశారా... ఇదేంటి పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ఇలా కోళ్ల ఫారంలో ఉండడమేమిటన్న అనుమానం కలుగుతుందా..?.. ఇది నిజమే.. ప్రభుత్వం సరఫరా చేసిన గోనె సంచుల్లోనే పీడీఎస్ బియ్యంను ఇలా అక్రమ మార్గంలో బొండపల్లి మండలం కొండకిండాంలో కోళ్ల ఫారం వద్దకు తరలించి నిల్వ చేశారు. ఇక్కడ నుంచి ధాన్యం మిల్లులకు తరలించి, అక్కడ మరోసారి మరపట్టి అధిక ధరలకు అమ్ముతున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజిలెన్స్ అధికారులు వెళ్లి బియ్యంను సీజ్ చేశారు. ఈ బియ్యం కథను తేల్చేపనిలో ఉన్నారు. అయితే, వారిపై పెద్దస్థాయి నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్టు సమాచారం.