
రెండు వారాల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లను పథకం రాష్ట్ర అధికారుల బృందం ఆదేశించింది. పీఎంశ్రీ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బందితో స్థానిక యూత్ హాస్టల్లో గురువారం రాష్ట్రబృందం అధికారులు డాక్టర్ ఎం.ప్రసాదరావు, మహేశ్వరరెడ్డి, జయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ పథకం మంజూరైన 34 పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సివిల్వర్క్స్’లో భాగంగా కెమిస్ట్రీ ల్యాబ్స్, లైబ్రరీ రూమ్స్, ప్లే ఫీల్డ్స్, కిచెన్ గార్డెన్ రియిన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర పనుల వివరాలను పాఠశాలల వారీగా తెలుసుకున్నారు. అదేవిధంగా అకడమిక్ పురోభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత పనులకు నిధులు మంజూరయ్యాయని జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎస్ఏ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఏఎంఓ బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణం పరిధిలోని మలిచర్ల ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ పథకం పనులను రాష్ట్ర బృందం పరిశీలించింది.
విద్యార్థి మిత్ర స్టాక్ పాయింట్ పరిశీలన
పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ పథకానికి సంబంధించిన సామగ్రి స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్ష రాష్ట్ర అధికార బృందం సందర్శించింది. త్వరలో జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు అందజేసే స్కూడెంట్ కిట్స్ను భద్రపరిచే ప్రదేశాలను పరిశీలించారు. జిల్లాకు వచ్చిన కిట్స్ ప్రతి విద్యార్థికి అందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు.
పీఎంశ్రీ స్కూల్స్ అభివృద్ధిపై రాష్ట్ర బృందం సమీక్ష