గుడ్డుకు గడ్డుకాలం! | - | Sakshi
Sakshi News home page

గుడ్డుకు గడ్డుకాలం!

Mar 19 2025 12:39 AM | Updated on Mar 19 2025 12:39 AM

గుడ్డ

గుడ్డుకు గడ్డుకాలం!

గుడ్డు వినియోగం తగ్గించవద్దు

కోడి గుడ్లును ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇతర ఇబ్బందులు ఉండవు. ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది. మన జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం లేదు. గుడ్డు వినియోగించడంలో అపోహలు వద్దు.

– కరణం హరిబాబు,

రాజాం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

రాజాం: బర్డ్‌ఫ్లూ ప్రభావంతో కోడి గుడ్డు వినియోగం జిల్లాలో సగానికి పడిపోయింది. డిమాండ్‌ తగ్గడంతో ధర కూడా పతనమైంది. ఒక్కో గుడ్డుపై రూ.2 నుంచి రూ.2.50 పైసల చొప్పున తగ్గింది. గుడ్డు ధర పతనం కావడంతో ఫౌల్ట్రీ యజమానులతో పాటు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

ట్రే ధర రూ.130

గతంలో కోడిగుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 మధ్య ఉండేది. వారం రోజులుగా ఈ ధర పతనమవుతూ వస్తోంది. రిటైల్‌ షాపులు వద్ద 30 గుడ్లు ట్రే ధర రూ.130లుగా ఉంది. ఈ లెక్కన ఒక్కో గుడ్డు ధర రూ.4.50లు పడుతోంది. గ్రామాల్లోని కిరాణా వర్తకులు ఒక్కో గుడ్డు రూ.5లు చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో 30 గుడ్లు ఉన్న ఈ ట్రే ధర మార్కెట్‌లో రూ.190 నుంచి రూ.210లు పలికేది.

జిల్లాలో 11లక్షలకు పడిపోయిన వినియోగం

విజయనగరం జిల్లాలో కోడిగుడ్డు వినియోగం గతంలో అధికంగానే ఉండేది. జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతిరోజు 19,60,000 గుడ్లు వినియోగించినట్టు వ్యాపార వర్గాల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు గుడ్లు వినియోగం రోజుకు 11 లక్షలకు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో కోడిగుడ్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేశారు. కోడిగుడ్డుతో తయారయ్యే న్యూడిల్స్‌, బిర్యానీ, రోటీలు కూడా తినడం లేదు. చికెన్‌ వినియోగం కూడా తగ్గింది. దీనికి ప్రత్యామ్నాయంగా చేపల వినియోగం పెరిగింది. ఇదే అదునుగా గతంలో రకాన్ని బట్టి కిలో రూ.120–రూ.150 మధ్యన పలికిన చేపల ధర ఇప్పుడు రూ.140 నుంచి రూ.180 పలుకుతోంది. మటన్‌ ధర కిలో రూ.900 నుంచి రూ.1000 మధ్య విక్రయిస్తున్నారు.

అవగాహన కల్పిస్తాం

గుడ్డు వినియోగంపై ప్రజలకు అవగాహన

కల్పిస్తాం. చికెన్‌ వినియోగంపై గతంలో డోలపేట వద్ద అవగాహన కల్పించాం. ఈ ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌ లేదు. నిర్థిష్ట రీతిలో గుడ్డు, చికెన్‌ బాగా ఉడికించి తినవచ్చు.

– బి.జయప్రకాష్‌, పశుసంవర్థకశాఖ ఏడీఏ, రాజాం

బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తగ్గిన కోడిగుడ్ల వినియోగం

గతంలో జిల్లాలో ప్రతిరోజు సగటున 19,60,000 గుడ్లు వినియోగం

ఇప్పుడు సగానికి పడిపోయిన విక్రయాలు

ధర సైతం ఒక్కో గడ్డుపై రూ.2 నుంచి రూ.2.50 పైసలు చొప్పున తగ్గుదల

పెరిగిన చేపల వినియోగం

వ్యాపారులకు కష్టాలు

జిల్లాలో ప్రత్యేకంగా బ్రాయిలర్‌ ఎగ్స్‌ విక్రయాలకు ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి. వీటి నుంచి కిరాణా షాపులు దగ్గర నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సరఫరా అయ్యేవి. ఇప్పుడు గుడ్డు వినియోగం మార్కెట్లో తగ్గడంతో వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ముందుగా అడ్వాన్స్‌ చెల్లించిన పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి తీసుకున్న గుడ్లు విక్రయించేందుకు అవస్థలు పడుతున్నారు. మరో వైపు కొత్త ఉత్పాదనకు చెక్‌ పెట్టేశారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఏర్పడిన గుడ్డు ఉత్పాదక పౌల్ట్రీఫామ్‌ల నిర్వహణ కష్టతరంగా మారింది.

గుడ్డుకు గడ్డుకాలం! 1
1/4

గుడ్డుకు గడ్డుకాలం!

గుడ్డుకు గడ్డుకాలం! 2
2/4

గుడ్డుకు గడ్డుకాలం!

గుడ్డుకు గడ్డుకాలం! 3
3/4

గుడ్డుకు గడ్డుకాలం!

గుడ్డుకు గడ్డుకాలం! 4
4/4

గుడ్డుకు గడ్డుకాలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement