69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి | - | Sakshi
Sakshi News home page

69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి

Mar 18 2025 10:00 PM | Updated on Mar 18 2025 10:01 PM

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని 69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వర్రావు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి, ఉద్యోగోన్నతులు కల్పించారు. వారి అభీష్టానికి అనుగుణంగా పోస్టింగులు కేటాయించారు. గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు 57 మందికి గ్రేడ్‌–4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గ్రేడ్‌–4 కార్యదర్శులు వివిధ కారణాలతో ఉద్యోగోన్నతిని తిరస్కరించారు. మిగిలిన 8 మంది కొత్త స్థానాల్లో చేరారు. ఉద్యోగోన్నతి లభించిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లా ఇన్‌చార్జ్‌ జేసీ ఎస్‌.శ్రీనివాసమూర్తి పత్రాలను పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement