
కనకమ్మ మృతికి నివాళులు అర్పించిన బొత్స
గుర్ల: దివంగత మాజీ ఎమ్మెల్యే (సతివాడ) పొట్నూరు సూర్యనారాయణ సతీమణి పాలవలస సర్పంచ్ పొట్నూరు కనకమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులైన గుర్ల ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైఎస్సార్సీపీ గుర్ల మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడులను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కనకమ్మ చిత్ర పటానికి నివాళులు ఆర్పించారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కనకమ్మకు నివాళులు ఆర్పించిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సందీప్. కేవీ సూర్యనారాయణ రాజు, జమ్ము స్వామి నాయుడు, కెంగువ పధుసూదనరావు, తోట తిరుపతిరావు, నియోజక వర్గం నాయకులు ఉన్నారు.