సీఎం జగన్‌తోనే అభివృద్ధి, సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

Feb 21 2024 1:32 AM | Updated on Feb 21 2024 1:32 AM

- - Sakshi

భోగాపురం: సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు భోగాపురం మండలంలోని రావివలస గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ.21.40 లక్షలతో నిర్మించిన రైతుభరోసా కేంద్రం, రూ.17.50 లక్షలతో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ భవనాలను సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పేదల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత అధికారం అడ్డుపెట్టుకుని విచ్చలవిడి దోపిడీలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయ వ్యవస్థ, పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతుల అభ్యున్నతి కోసం ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్‌ అని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, పడాల భానుప్రకాశ్‌, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్‌, ఉప్పాడ విజయ్‌భాస్కర్‌రెడ్డి, నడుపూరి సత్యనారాయణనా యుడు, పంచాయతీరాజ్‌ డీఈ బంగారునాయుడు, తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎంపీడీఓ చంద్రకళ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement