పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Dec 20 2025 6:52 AM | Updated on Dec 20 2025 6:52 AM

పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా నుంచి అవార్డు అందుకుంటున్న సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి

అల్లిపురం: నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ క్రైం డిటెక్షన్‌) పురస్కారాన్ని అందుకున్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఈ అవార్డును అందజేశారు. సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ ఫ్రాడ్‌ కేసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 19 మంది అరెస్టు చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా సీపీకి ఈ గౌరవం దక్కింది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సైబర్‌ క్రైమ్‌ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించింది. సీపీ బాగ్చీతో పాటు సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్లు కె. భవానీప్రసాద్‌, బీ.ఎం.డీ. ప్రసాద్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ. మహేశ్వరరావు, కానిస్టేబుళ్లు టి. సన్యాసినాయుడు, బి. చంద్రశేఖర్‌లు డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement