కట్టిపడేస్తున్న కళారూపాలు | - | Sakshi
Sakshi News home page

కట్టిపడేస్తున్న కళారూపాలు

Dec 20 2025 6:52 AM | Updated on Dec 20 2025 6:52 AM

కట్టి

కట్టిపడేస్తున్న కళారూపాలు

ఏయూక్యాంపస్‌: ఏయూ మైదానం ప్రస్తుతం గ్రామీణ కళా సౌరభాలతో విరాజిల్లుతోంది. అక్కడ జరుగుతున్న సరస్‌ డ్వాక్రా బజార్‌ నగరవాసులను అద్భుతమైన హస్తకళల లోకంలోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటు ధర్మవరం తోలుబొమ్మలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అంకుడు కర్రను ఆకర్షణీయమైన ఆకృతులుగా మలచి, వాటికి సహజసిద్ధమైన రంగులు అద్ది ప్రాణం పోస్తున్న ఏటికొప్పాక కళాకారుల నైపుణ్యం ప్రతి బొమ్మలోనూ ప్రతిబింబిస్తోంది. ఇక్కడి విగ్రహాలు, గృహాలంకరణ వస్తువులు కేవలం వస్తువులుగా కాకుండా మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ధర్మవరం కళాకారులు తోలుపై చిత్రించిన పురాణ గాథలు, విభిన్న కళాఖండాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సంప్రదాయ కళకు కొంత ఆధునికతను జోడించి వీరు రూపొందించిన అలంకరణ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తోలుపై రంగురంగుల కలయికతో తీర్చిదిద్దిన గణపతి, గౌతమ బుద్ధుడు, రాధాకృష్ణుల చిత్రాలు వారి అకుంఠిత దీక్షకు, కళా ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. రానున్న పండుగలకు బొమ్మల కొలువు తీర్చాలన్నా లేదా ఇంటిని కళాత్మకంగా అలంకరించుకోవాలన్నా ఈ ప్రదర్శన ఒక అద్భుత వేదికగా మారింది. కుటీర పరిశ్రమల ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. గ్రామీణ హస్తకళలు నేటికీ ఎంత సజీవంగా ఉన్నాయో ఈ బజార్‌ నిరూపిస్తోంది.

ఆకట్టుకుంటున్న

హస్తకళలు

కట్టిపడేస్తున్న కళారూపాలు 1
1/2

కట్టిపడేస్తున్న కళారూపాలు

కట్టిపడేస్తున్న కళారూపాలు 2
2/2

కట్టిపడేస్తున్న కళారూపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement