ఉత్సాహంగా పరుగు
పరుగు
సాగిందిలా...
● 42కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ కారియర్ మారథాన్ ఉదయం 4.15 గంటలకే ప్రారంభమైంది. ఇది ఐఎన్ఎస్ కళింగ వద్ద యూ టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ వేదిక వద్దకు చేరుకోవడంతో ముగిసింది.
● 21 కిలోమీటర్ల సబ్మైరెన్ హాఫ్ మారథాన్ ఉదయం 4.30 గంటలకు మొదలై, గాయత్రి కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది.
● 10 కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ రన్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై, తెన్నేటి పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంది.
● 5 కిలోమీటర్ల ఫ్రిగేట్ పరుగు (సరదా పరుగు) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చిన్నారులు సైతం హుషారుగా పాల్గొన్నారు. ఇది కురుసురా సబ్మైరెన్ మ్యూజియం మీదుగా వైఎస్సార్ విగ్రహం చెంత యూటర్న్ తీసుకుని ముగిసింది.


