కూర్మావతారంలో జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

కూర్మావతారంలో జగన్నాథుడు

Jun 30 2025 7:30 AM | Updated on Jun 30 2025 7:30 AM

కూర్మావతారంలో జగన్నాథుడు

కూర్మావతారంలో జగన్నాథుడు

డాబాగార్డెన్స్‌: టర్నర్‌ చౌల్ట్రీలో జగన్నాథస్వామి కూర్మావతారంలో ఆదివారం దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు స్వామికి మేలుకొలుపు, నాదస్వరం, 6 నుంచి 7 గంటల వరకు నిత్యపూజ, 7 నుంచి 9.30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘంచే ప్రార్థనా తరంగిణి, 9.30 నుంచి 10.30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రథయాత్రలో భాగంగా సోమవారం జగన్నాథ స్వామి వరహావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement