
కూర్మావతారంలో జగన్నాథుడు
డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో జగన్నాథస్వామి కూర్మావతారంలో ఆదివారం దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు స్వామికి మేలుకొలుపు, నాదస్వరం, 6 నుంచి 7 గంటల వరకు నిత్యపూజ, 7 నుంచి 9.30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘంచే ప్రార్థనా తరంగిణి, 9.30 నుంచి 10.30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రథయాత్రలో భాగంగా సోమవారం జగన్నాథ స్వామి వరహావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు.