
రైలు నుంచి జారిపడిన యువకులు
గోపాలపట్నం: ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి ఇద్దరు యువకులు జారిపడగా, వారిలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సింహాచలం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పవిత్రా దాస్, సగ్రామ్ దాస్ ప్రయాణిస్తున్నారు. సింహాచలం రైల్వేస్టేషన్లో ఈ రైలుకు హాల్ట్ లేదు. అయితే రైలు స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో వారు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది గమనించి వారిని కాపాడారు. వారిలో ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. ఈ యువకులు ఒడిశా రాష్ట్రం డెంకనాల్ జిల్లా కుకట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు వెళ్తున్న వీరు ఫుట్బోర్డుపై కూర్చోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై పడటం వల్ల ప్రాణాపాయం తప్పిందని ఆర్పీఎఫ్ ఎస్ఐ సూరజ్ కుమార్, ఏఎస్ఐ జి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ డి.జగదీష్ తెలిపారు.
ఒకరికి గాయాలు