
బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం
విశాఖ లీగల్ : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జి, లోక్ అదాలత్ న్యాయమూర్తి జి.వల్లభ నాయుడు అన్నారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ, జిల్లా విద్యాశాఖ, యాక్సిస్టివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. నిరక్షరాస్యత, వలస వెళ్లడం, ఇంటి పనులకు పెట్టడం, ఆర్థిక పరిస్థితుల వల్ల బాలలు బాల కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ లేబర్ సునీత మాట్లాడుతూ బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో తమ సమస్త డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. తిరిగి రిహాబ్లేట్ చేయడం కోసం బాలల సంక్షేమ సమితి, ఇతర డిపార్టుమెంటు, స్వచ్ఛంద సేవా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.పుష్యరాగం మాట్లాడుతూ చదువుకోవలసిన బాలలు పనిలోకి వెళ్లడం విచారకరమన్నారు. యాక్సిస్ టు జస్టిస్ అప్ హోల్డ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జి.డేవిడ్ రాజు మాట్లాడుతూ తమ సంస్థ గత సంవత్సరం లేబర్ డిపార్టుమెంటు, మిగిలిన సంస్థలతో కలిసి 2012 మందిని రిస్క్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ అధికారిణి మమత పాల్గొన్నారు