
జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా పల్లంరాజు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా జీవీ పల్లంరాజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గత నెల 31న జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా విధులు నిర్వహించిన పి. శివప్రసాదరాజు పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్గా ఉన్న పల్లంరాజుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్బాబు పూర్తి అదనపు బాధ్యతలతో జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా ఉత్తర్వులు జారీ చేశారు.
కొనసాగుతున్న ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎస్జీటీ బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా, శుక్రవారం 801 నుంచి 1,600 వరకు సీరియల్ నంబర్లు ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు 800 మందికి ఈ ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొనసాగింది. రాత్రి 8:45 గంటల సమయానికి సీరియల్ నంబర్ 1358 వరకు కౌన్సెలింగ్ పూర్తయింది. మిగిలిన 242 మంది అభ్యర్థులకు అర్ధరాత్రి తర్వాత కూడా కౌన్సెలింగ్ కొనసాగింది. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ప్రేమ్కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 1,601వ సీరియల్ నంబర్ నుంచి చివరి నంబర్ వరకు ఉన్న అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు ఉదయం 8:30 గంటలకే కౌన్సెలింగ్ హాల్కు చేరుకోవాలని ఆయన సూచించారు.
డీఎస్సీ పరీక్షకు 172 మంది గైర్హాజరు
ఆరిలోవ: జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్నా యి. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 172 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు ఐదు కేంద్రాలలో మొత్తం 1,642 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదేవిధంగా, మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షకు ఎనిమిది కేంద్రాలలో 2,337 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాలను డీఈవో ఎన్. ప్రేమ్కుమార్ స్వయంగా సందర్శించారు. ఆయన ఒక కేంద్రాన్ని పరిశీలించగా, ఫ్లైయింగ్ స్క్వాడ్ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. ఉదయం జరిగిన పరీక్షకు 109 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.