కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు

డాబాగార్డెన్స్‌: కనకమహాలక్ష్మి హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మార్చి 27 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రూ.53,29,489 నగదు, 59 గ్రాముల బంగారం, 990 గ్రాముల వెండి లభించింది. అలాగే యూఎస్‌ఏకి చెందిన 32 డాలర్లు, కువైట్‌కు చెందిన 1/4 దినర్‌, 5 రూపీస్‌ నేపాల్‌ కరెన్సీ, శ్రీలంకకు చెందిన 100 రుపీస్‌, ఇంగ్లండ్‌కు చెందిన 5 యూరోస్‌, హాంగ్‌కాంగ్‌ కరెన్సీ 20 డాలర్లు, సింగపూర్‌ కరెన్సీ 10 డాలర్లు, అరబ్‌ ఎమిరేట్స్‌ 5 దిరమ్స్‌ వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె.శోభారాణి, వెలంపేట దుర్గాలమ్మ ఆలయ ఈవో పి.శేఖర్‌బాబు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావు, గోపాలపట్నం శ్రీ హరి సేవ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement