
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మార్చి 27 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రూ.53,29,489 నగదు, 59 గ్రాముల బంగారం, 990 గ్రాముల వెండి లభించింది. అలాగే యూఎస్ఏకి చెందిన 32 డాలర్లు, కువైట్కు చెందిన 1/4 దినర్, 5 రూపీస్ నేపాల్ కరెన్సీ, శ్రీలంకకు చెందిన 100 రుపీస్, ఇంగ్లండ్కు చెందిన 5 యూరోస్, హాంగ్కాంగ్ కరెన్సీ 20 డాలర్లు, సింగపూర్ కరెన్సీ 10 డాలర్లు, అరబ్ ఎమిరేట్స్ 5 దిరమ్స్ వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె.శోభారాణి, వెలంపేట దుర్గాలమ్మ ఆలయ ఈవో పి.శేఖర్బాబు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావు, గోపాలపట్నం శ్రీ హరి సేవ సభ్యులు పాల్గొన్నారు.