అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ విజేత ఒడిశా | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ విజేత ఒడిశా

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

అంతర్

అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ విజేత ఒడిశా

రన్నరప్‌గా ఆంధ్రప్రదేశ్‌ జట్టు

ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీఏబీఏపీ), క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్‌లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్‌లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌కు డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్‌ శర్మ, హెచ్‌ఆర్‌ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ విజేత ఒడిశా 1
1/1

అంతర్‌ రాష్ట్ర మహిళల బ్లైండ్‌ క్రికెట్‌ విజేత ఒడిశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement