
విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత
గోపాలపట్నం: దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో భద్రతను పటిష్టం చేశారు. శనివారం విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి వాహనాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు పలు ప్రాంతాల్లో నిఘా ఉంచి పహారా కాశారు. టెర్మినల్ భవనంలో కూడా విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులతో పాటు దుస్తులను స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల నేపథ్యంలో ప్రయాణికులు కనీసం మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. హై అలర్ట్ కారణంగా విమానాశ్రయం లోపలికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. సందర్శకుల టిక్కెట్ల అమ్మకాలను కూడా నిలిపివేశారు.