
సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తా..
పదో తరగతిలో (సీబీఎస్సీ) 450 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్లో 26 ర్యాంక్ సాధించాను. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీలో కంప్యూర్ సైన్స్ చదువుతాను. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతాను.
– పి.హర్షవర్ధన్
ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవుతా..
పదో తరగతిలో (సీబీఎస్సీ) 98.6 శాతం మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్లో 96వ ర్యాంకు సాధించాను. అధ్యాపకుల సూచనలు తీసుకొని అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నాను. మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో ఈఈఈలో చేరి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాను. –ఎ.పాండ్యే
సివిల్స్ సాధిస్తా..
జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరిలో 2,012, ఓబీసీ కేటగిరిలో 354వ ర్యాంకు సాధించాను. అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నాను. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ సాధించడమే లక్ష్యం. నాన్న నాగభూషణరావు ప్రైవేట్ పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. –శంబంగి హేమహేవిల్, వడ్లపూడి

సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తా..

సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తా..