
మెయిన్స్లో మెరిశారు
సీతమ్మధార/మద్దిలపాలెం/సీతంపేట/కూర్మన్నపాలెం: దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన, జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు అదరగొట్టారు. ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఆయా కేటగిరిల్లో వందలోపు ర్యాంకులు సాధించారు. వీరితోపాటు అధిక సంఖ్యలో విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. అందులోనూ ప్రతిభ చాటితే కోరుకున్న ఐఐటీల్లో సీటు గ్యారంటీ అవుతుంది.