
శశి కళాశాల విద్యార్థుల ప్రతిభ
తగరపువలస: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సంగివలసలో గల శశి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాల్లో పి.హర్షవర్థన్ 99.90 శాతం, ఎం.హరితేజ 99.88 శాతం, బి.బాల అనిక్ 99.67 శాతం, డి.మోహన్ 99.56, పి.శ్రావణ్ 99.52 శాతం, కె.నాగరామ్చరణ్ 99.49 శాతం, ఆర్. మౌళి 99.45శాతం, డి. స్టిఫెన్ 99.45 శాతం సాఽధించినట్లు శశి విద్యా సంస్థల చైర్మెన్ బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణ తెలిపారు. 99 శాతంతో 14 మంది, 98 శాతంతో 25 మంది, 97 శాతంతో 39 మంది, 96 శాతంతో 54 మంది, 91 శాతంతో 71 మంది, 90 శాతంతో 140 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.