
నారాయణ విద్యార్థుల సత్తా
సీతమ్మధార: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల(హాస్టల్ డివిజన్) విద్యార్థులు మరోసారి సత్తా చాటారని సంస్థ డీజీఎం డి.హనుమంతరావు తెలిపారు. జాతీయ స్థాయిలో 100లోపు 2, 12, 16, 36, 42, 44, 72 ర్యాంకులతో పాటు, ఓపెన్ కేటగిరీలో పప్పల శ్రీహర్షవర్ధన్ 26వ ర్యాంక్, పి.ఆనంద్ చక్రవర్తి 86, ఎ.పాండ్య 95, పూర్ణసాయి మమ్మిడి 116, ఆరంగి సాత్విక్ 271, ఎల్.సాయి ప్రియతం 326, టి.మనోహర్ 328, ఆదివిష్ణు సుబ్రహ్మణ్యం 461, పొట్నూరు కార్తీక్ 481, కొత్త కోట వెంకట అరవింద్ 494, గైతం విజయ కాశ్యప్ 513, బి.ఈశ్వర్ తనూజ్ 521, ప్రభాస్ చంద్ర సింగ్ 692, లక్ష్య జైన్ 732, పి.ప్రశాంతి 818వ ర్యాంకులు సాధించారని వివరించారు. మొత్తంగా 100లోపు మూడు ర్యాంకులు, 500లోపు 10 ర్యాంకులు, వెయ్యిలోపు 15 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.