
విశాఖ స్టీల్ప్లాంట్కు ఎక్స్లెన్స్ ట్రోఫీ
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ 2024–25 సంవత్సరానికి గాను జాతీయ ఉక్కు పరిశ్రమల స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టీల్ప్లాంట్ స్పోర్ట్స్ బోర్డు (ఎస్పీఎస్బీ) ఎక్స్లెన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. స్టీల్ప్లాంట్ స్పోర్ట్స్ బోర్డు ఏటా నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చినందుకు గాను ఈ పురస్కారం లభించింది. ఎస్పీఎస్బీ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్, చెస్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, స్విమ్మింగ్ వంటి క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్తో పాటు అల్లాయ్ స్టీల్ప్లాంట్, భిలాయ్ స్టీల్ప్లాంట్, బొకారో స్టీల్ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ప్లాంట్, ఇస్కో స్టీల్ప్లాంట్, రూర్కెలా స్టీల్ప్లాంట్, సేలం స్టీల్ప్లాంట్, విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ప్లాంట్, టాటా స్టీల్ , జెఎస్డబ్ల్యూ స్టీల్ప్లాంట్ జట్లకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. 2024–25 సంవత్సరంలో ఎస్పీఎస్బీ నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు విజేతగా నిలవగా, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. చెస్ పోటీల్లో మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాష్ చేతుల మీదుగా స్టీల్ప్లాంట్ స్పోర్ట్స్ విభాగం జనరల్ మేనేజర్ టి.కె. ఘోష్ ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అందుకున్నారు. ఈ అవార్డు లభించడంపై స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ చీఫ్ మెంటెనెన్స్ ఎ.కె. సక్సేనా , డైరెక్టర్ ఎస్.సి. పాండే .. క్రీడాకారులను అభినందించారు.

విశాఖ స్టీల్ప్లాంట్కు ఎక్స్లెన్స్ ట్రోఫీ